Telangana: బీబీ నగర్ AIIMSను సందర్శించిన మంత్రి హరీశ్ రావు
ABN , First Publish Date - 2022-05-20T21:39:08+05:30 IST
బీబీ నగర్ ఎయిమ్స్(All India Institute of Medical Sciences)ను మంత్రి హరీశ్ రావు సందర్శించారు. వైద్య సదుపాయాల లేమిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి భూములు, భవనాలు
Hyderabad: బీబీ నగర్ ఎయిమ్స్(All India Institute of Medical Sciences)ను మంత్రి హరీశ్ రావు సందర్శించారు. వైద్య సదుపాయాల లేమిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి భూములు, భవనాలు ఇచ్చి, అన్ని రకాల మద్దతు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇంత పెద్ద సంస్థలో 20 మంది ఐపీ పేషెంట్లు మాత్రమే ఉండటం దారుణమన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు క్లినికల్ ప్రాక్టీస్ చేయలేక, యాదాద్రి జిల్లా ఆసుపత్రికి వెళ్తున్నారని చెప్పారు. ఇక్కడి పరిస్థితులను కేంద్రానికి చెబుతామన్నారు. కిషన్ రెడ్డి ఎయిమ్స్ అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.