మంత్రికి అస్వస్థత: అపోలో ఆస్పత్రిలో చికిత్స

ABN , First Publish Date - 2022-04-13T13:35:47+05:30 IST

డీఎంకే ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి, దురైమురుగన్‌ మంగళవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం గ్రీమ్స్‌రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ

మంత్రికి అస్వస్థత: అపోలో ఆస్పత్రిలో చికిత్స

చెన్నై: డీఎంకే ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నీటివనరుల శాఖ మంత్రి, దురైమురుగన్‌ మంగళవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం గ్రీమ్స్‌రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆస్పత్రికి వెళ్ళి ఆయనను పరామర్శించారు. మంగళవారం ఉదయం దురైమురుగన్‌కు స్వల్ప జ్వరంతోపాటు శ్వాసపీల్చుకోవడం కూడా కష్టమైంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత కోలుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగైందని త్వరలో డిశ్చార్జ్‌ అవుతారని వైద్యులు తెలిపారు.

Updated Date - 2022-04-13T13:35:47+05:30 IST