కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు: మంత్రి Harish rao

ABN , First Publish Date - 2022-02-17T19:59:24+05:30 IST

కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని మంత్రి హరీష్ అన్నారు.

కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు: మంత్రి Harish rao

సిద్దిపేట: కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీష్‌రావు రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు నీటిని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ కారణజన్ముడని, ప్రజల ఆకాంక్షలను సీఎం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు తెలంగాణ గుక్కెడు తాగునీటి కోసం కష్టాలు పడిందని గుర్తుచేశారు. కానీ... నేడు సాగునీరు ఇస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని మంత్రి చెప్పారు.


కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకున్నా, ప్రాజెక్ట్‌లకు అడ్డుపడుతున్నా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సిద్దిపేటతో పాటు సిరిసిల్ల మానకొండూర్ హుస్నాబాద్ నియోజకవర్గలకు నీరు అందుతోందని తెలిపారు. గతంలో రైతుల చెమట చుక్కలతో కష్టపడి సంపాదించిన డబ్బు బోరు బావులకే సరిపోయేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కాలిపోయిన మోటార్ ట్రాన్స్‌ఫార్మ్‌లతో అప్పుల పాలు అయ్యేవారని తెలిపారు.  రాష్ట్ర ప్రజల పక్షాన సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపుతూ.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. 

Updated Date - 2022-02-17T19:59:24+05:30 IST