మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హరీశ్

ABN , First Publish Date - 2021-08-24T19:17:56+05:30 IST

సిద్దిపేట: మంత్రి హరీశ్‌రావు తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ రహదారిపై ప్రమాదం మంగళవారం జరిగింది.

మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హరీశ్

సిద్దిపేట: మంత్రి హరీశ్‌రావు తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మిరుదొడ్డి మండలం  ఖాజీపూర్ రహదారిపై మంగళవారం ప్రమాదం జరిగింది. దంపతులు తమ పాపతో సహా.. బైకుపై వెళ్తూ చెట్టుకు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురూ గాయపడ్డారు. ఆ సమయంలో అదే దారిలో వెళ్తున్న హరీశ్‌రావు.. వారిని గమనించి కారు దిగారు. వెంటనే అంబులెన్స్‌ను పిలిపించారు. క్షతగాత్రులను దగ్గరుండి అందులోకి ఎక్కించి.. సిద్దిపేట ఆస్పత్రికి పంపించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Updated Date - 2021-08-24T19:17:56+05:30 IST