సాగుబడికి డబ్బు ఇచ్చే రాష్ట్రం.. తెలంగాణ ఒక్కటే: హరీష్రావు
ABN , First Publish Date - 2021-08-08T22:06:44+05:30 IST
సిద్దిపేట : దేశంలో రైతులకు ఉచిత విద్యుత్, నీళ్లు, సాగుబడికి డబ్బు ఇచ్చే రాష్ట్రం.. తెలంగాణ ఒక్కటే అని మంత్రి హరీష్ రావు అన్నారు.
సిద్దిపేట : దేశంలో రైతులకు ఉచిత విద్యుత్, నీళ్లు, సాగుబడికి డబ్బు ఇచ్చే రాష్ట్రం.. తెలంగాణ ఒక్కటే అని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ అమలు చేసిన సందర్భంగా తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఆదివారం కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభకు మంత్రి హరీష్ రావు, మాజీ MLC పాతూరి సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ ఇంటింటికీ నీళ్లిచ్చే విషయంలో కేంద్ర మంత్రి భైరవ సింగ్ షెకావత్.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారని గుర్తు చేశారు. వారు బీజేపీకి చెందిన వారైనా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారని.. పని చేస్తే ప్రశంసలు దక్కుతాయనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. తలసరి ఆదాయంలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ నాలుగు మూలల్లో నాలుగు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే.. మోడల్ స్కూళ్లు నడుస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.