AP News: విశాఖ రాజధాని కోసం రాజీనామాకైనా సిద్ధమే..మంత్రి ధర్మాన
ABN , First Publish Date - 2022-10-07T22:35:39+05:30 IST
Srikakulam: విశాఖ రాజధాని కోసం తాను రాజీనామాకైనా సిద్ధమేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవళ్లిలో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘విశాఖ రాజధా
Srikakulam: విశాఖ రాజధాని కోసం తాను రాజీనామాకైనా సిద్ధమేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవళ్లిలో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘విశాఖ రాజధాని కోసం ఉద్యమం అవసరం. ఉత్తరాంధ్ర అభివృద్ధి వద్దు అంటే ఎలా అంగీకరిస్తాం. అరసవెల్లి వచ్చి అమరావతి రైతులు దేవుణ్ణి మొక్కుకుని వెళ్తే మాకు అభ్యంతరం లేదు. ఈ గడ్డ మీదికి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోం. దశాబ్దాల తర్వాత వచ్చిన అద్భుత అవకాశం ఇది. టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుబడితో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారు. సిక్కోలు జిల్లా వాసులు విశాఖ రాజధాని కోసం గట్టిగా నినదించాలి.’’ అని విజ్ఞప్తి చేశారు.