ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి తనిఖీ
ABN , First Publish Date - 2021-04-17T05:11:49+05:30 IST
కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి తానేటి వనిత శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.
కొవ్వూరు, ఏప్రిల్ 16 : కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి తానేటి వనిత శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. రాత్రి సమయంలో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని, ఎక్కువ శాతం పేషెంట్లను రాజమహేంద్రవరం రిఫర్ చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆసుపత్రి సేవలపై పరిశీలించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆర్డీవో డి.లక్ష్మారెడ్డికి సూచించారు.