పేదలకు అండగా ఉంటాం: మంత్రి
ABN , First Publish Date - 2020-10-16T06:30:03+05:30 IST
పేద ప్రజలకు అండగా ఉంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామాకూర మల్లారెడ్డి అన్నారు.
కీసర: పేద ప్రజలకు అండగా ఉంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామాకూర మల్లారెడ్డి అన్నారు. మండల కేంద్రం కీసర గ్రామానికి చెందిన మచ్చాని శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.50వేలు మంజూరు కాగా గురువారం మంత్రి మల్లారెడ్డి ఆయన నివాసంలో శ్రీనివా్సకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్రెడ్డి, నాయకులు శశికాంత్లతో పాటు పలువురు పాల్గొన్నారు.