కనీస ‘మద్దతు’ పెంపు!
ABN , First Publish Date - 2020-05-24T07:46:34+05:30 IST
రైతన్నలకు శుభవార్త! పండించే పంటకు మరింత గిట్టుబాటు ధర లభించనుంది. వానాకాలం పంటలకుగాను కనీస మద్దతు ధరలను (ఎంఎ్సపీ) కేంద్ర ప్రభుత్వం పెంచనుంది. 17 పంటలకు సంబంధించి మద్దతు ధరలను పెంచుతూ వ్యవసాయ...
- క్వింటాలు వరి ధాన్యంపై రూ.53
- జాబితాలో పత్తి, మొక్కజొన్న, వేరుశనగ
- నూనె గింజల సాగుకు మరింత మద్దతు
- ధరలు పెంచుతూ సీఏసీపీ సిఫారసు
- కేంద్ర కేబినెట్ ఆమోదమే తరువాయి
న్యూఢిల్లీ, మే 23 (ఆంధ్రజ్యోతి): రైతన్నలకు శుభవార్త! పండించే పంటకు మరింత గిట్టుబాటు ధర లభించనుంది. వానాకాలం పంటలకుగాను కనీస మద్దతు ధరలను (ఎంఎ్సపీ) కేంద్ర ప్రభుత్వం పెంచనుంది. 17 పంటలకు సంబంధించి మద్దతు ధరలను పెంచుతూ వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్ (సీఏసీపీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సిఫారసులను త్వరలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, ప్రకటన చేస్తుందని చెప్పాయి.
సాధారణ వరి ధాన్యానికి క్వింటాలుకు రూ.53 పెంచి ధరను రూ. 1868గా ప్రతిపాదించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. నూనెగింజల పంటలకు కనీస మద్దతు ధరను ఎక్కువగా ప్రతిపాదించిందని, దిగుమతులను తగ్గించుకోడానికి వీలుగా నూనె గింజల సాగుకు రైతులను ప్రోత్సహించడం కోసం వీటికి మద్దతు ధరలు భారీగా పెంచాలని సూచించిందని వివరించాయి. సీఏసీపీ ప్రతిపాదనలపై ఆహారానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలు సంప్రదింపులు జరుపుతున్నాయని, తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదానికి వెళ్తాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. సీఏసీపీసిఫారసులను మంత్రివర్గం యఽథాతథంగా ఆమోదిస్తుంది.