బిచ్చగాడిగా మారిన కోటీశ్వరుడు... కారణం తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2021-03-04T18:00:45+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మున్సిపల్ సిబ్బంది...

బిచ్చగాడిగా మారిన కోటీశ్వరుడు... కారణం తెలిస్తే షాకవుతారు!

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మున్సిపల్ సిబ్బంది, జిల్లా అధికారులు సంయుక్తంగా అనాథ వ్యక్తులను ఆదుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి పునరావాసం కల్పించే పనులను చేపట్టారు. ఈ నేపధ్యంలో వారికి బిచ్చగానిగా మారిన రమేష్ అనే కోటీశ్వరుడు తారసపడ్డాడు. రమేష్ రెండేళ్లుగా యాచన చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. వివరాల్లోకి వెళితే దీనబంధు పునరావాస యోజన పథకంలో భాగంగా ఇండోర్‌లో ఫిబ్రవరి 24న అధికారులు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 109 మంది అనాథలను తీసుకువచ్చారు. వీరికి తగిన వైద్య చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకడే రమేష్ యాదవ్. 


రెండేళ్లుగా రమేష్ ఒక ఆలయం దగ్గర బిచ్చగానిగా కాలం గడుపుతున్నాడు. పెళ్లి కూడా చేసుకోలేదు. అధికారులకు రమేష్ ఇచ్చిన సమాచారం మేరకు వారు రమేష్ ఇంటికి వెళ్లారు. ఆ ఇంటిలోని హంగులను చూసిన వారు తెగ ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. అయితే రమేష్‌కు ఉన్న ఒక్క అలవాటు అతనిని బిచ్చగానిగా మార్చివేసింది. అతని మద్యం అలవాటే అతనిని ఈ దుస్థితికి తీసుకువచ్చింది. రమేష్ కు ఒక సొంత భవనం, ప్లాట్ ఉన్నాయి. వాటి విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది. అయితే విపరీతంగా మద్యం తాగే అలవాటు కారణంగా అతను ఆలయం దగ్గర బిచ్చమెత్తుకుంటూ కాలం గడుపుతున్నాడు. రమేష్ పరిస్థితిని గమనించిన అధికారులు అతనికి కౌన్సెలింగ్ ఇప్పించారు. దీంతో రమేష్ ఆరోగ్యం మెరుగుపడింది. తిరిగి రమేష్ తన ఇంటికి చేరుకున్నాడు.

Updated Date - 2021-03-04T18:00:45+05:30 IST