పాలకేంద్రాల అధ్యక్షులకు అభినందన
ABN , First Publish Date - 2022-07-07T05:58:36+05:30 IST
గ్రామాల్లో పాడిపరిశ్రమను అభివృద్ధి చేయడంతో పాటు కృష్ణామిల్క్ యూనియన్కు తమవంతు సేవలందిస్తూ కొత్త గా ఎన్నికైన పాల సంఘాల అధ్యక్షులు పదవులకు వన్నె తేవాలని కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు.
పామర్రు : గ్రామాల్లో పాడిపరిశ్రమను అభివృద్ధి చేయడంతో పాటు కృష్ణామిల్క్ యూనియన్కు తమవంతు సేవలందిస్తూ కొత్త గా ఎన్నికైన పాల సంఘాల అధ్యక్షులు పదవులకు వన్నె తేవాలని కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. పాలశీతల కేంద్ర సమావేశ మందిరంలో బుధవారం నూతనంగా ఎన్నికైన గ్రామ పాలసంఘాల అధ్యక్షుల అభినందనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజేంద్రకుమార్(యండకుదురు), శ్రీహరిరావు (భోగిరెడ్డిపల్లి), శ్రీనివాసరావు(పాతమాజేరు). వీరయ్య (నెక్కళవారిపాలెం), నాగరాజు (వేములవాడ), ఏసు (జుఝ్జవరం), శివయ్య (ముక్కొల్లు), వెంకట నాంచారయ్య (ఐనపూరు), ఏడుకొండలు (ముళ్లపూడి)లను ఘనంగా సత్కరించి అభినందించారు. మిల్క్ యూనియన్ డైరక్టర్ వేమూరి సాయిబాబు, పులి వెంకటరత్నం, పామర్రు మిల్క్ సెంటర్ మేనేజరు గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.