ఆగని వలసలు... ఇంటిముఖం దిశగా రోడ్లపైకి జనం!

ABN , First Publish Date - 2020-03-29T11:30:25+05:30 IST

లాక్ డౌన్ పరిస్థితులలో దేశవ్యాప్తంగా కార్మికులను వారి ఇళ్లకు తరలించడం పెద్ద సవాలుగా మారింది. దీనిని పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిస్థితి...

ఆగని వలసలు... ఇంటిముఖం దిశగా రోడ్లపైకి జనం!

ఢిల్లీ: లాక్ డౌన్ పరిస్థితులలో దేశవ్యాప్తంగా కార్మికులను వారి ఇళ్లకు తరలించడం పెద్ద సవాలుగా మారింది. దీనిని పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిస్థితి దారుణంగా మారింది. రిక్షా డ్రైవర్లు, ఫ్యాక్టరీ కార్మికులు... ఇలా వేలాది మంది తమ గ్రామాలకు వెళ్లేందుకు  ఢిల్లీలోని ఆనంద్ విహార్ ఇంటర్ స్టేట్ బస్ స్టాండ్ దగ్గరకు తరలివచ్చారు. దీనితో అక్కడ విపరీతమైన రద్దీ నెలకొంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ మాత్రమే కాకుండా దేశంలోని ఇతర పెద్ద, చిన్న నగరాలలో కూడా వలసలు ఇలాగే కొనసాగుతున్నాయి. అది కాన్పూర్ అయినా, సోనిపట్ అయినా, సిర్సా అయినా, అగర్ మాల్వా అయినా ఒకేలా వుంది. ఉపాధి కోల్పోయి, కనీసం ప్రాణాలైనా నిలబెట్టుకుందామని వీరంతా తమ స్వగామాల బాట పట్టారు. 

Updated Date - 2020-03-29T11:30:25+05:30 IST