ఒడిశాకు వలస కార్మికుల తరలింపు

ABN , First Publish Date - 2020-05-29T11:24:26+05:30 IST

ఒడిశాకు చెందిన 90 మంది వలస కూలీలను ప్రత్యేక బస్సుల్లో ఆ రాష్ర్టానికి గురు వారం తరలించారు.

ఒడిశాకు వలస కార్మికుల తరలింపు

ఏలూరు క్రైం, మే 28 : ఒడిశాకు చెందిన 90 మంది వలస కూలీలను ప్రత్యేక బస్సుల్లో ఆ రాష్ర్టానికి గురు వారం తరలించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఎవరైనా వలస కార్మికులు మార్గమధ్యలో చిక్కు బడితే ప్రత్యేక వసతులను ఏర్పాటుచేసి వారిని స్వగ్రా మాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశిం చింది. ఈ నేపథ్యంలో జిల్లా న్యాయసేవా అధికార సం స్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.శైలజ ఏలూరు సమీపంలోని వట్లూరు బాలయోగి గురుకుల పాఠశాల ను గురువారం సందర్శించారు. అక్కడ ఉన్న ఒడిశాకు చెందిన 90 మంది వలస కూలీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ అధికారులు, రెడ్‌క్రాస్‌ సభ్యు ల సహకారంతో 3 బస్సుల్లో ఒడిశాకు తరలించారు.  


బిహార్‌కు 175 మంది తరలింపు

కొవ్వూరు/ఆకివీడు : ఉపాధి నిమిత్తం బిహార్‌ నుంచి కొవ్వూరు వచ్చిన 147 మందిని, ఆకివీడు వచ్చిన 28 మందిని గురువారం ఆర్టీసీ బస్సుల్లో రాజమండ్రికి పంపించారు. అక్కడి నుంచి వీరంతా ప్రత్యేక రైలులో వారి రాష్ట్రానికి వెళతారని ఆర్డీవో లక్ష్మారెడ్డి, ఆర్‌ఐ పెద్దిరాజు తెలిపారు. 

Updated Date - 2020-05-29T11:24:26+05:30 IST