ఎంజీఆర్ విగ్రహానికి నిప్పు
ABN , First Publish Date - 2021-03-02T12:13:30+05:30 IST
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో వేడి రాజుకుంటోంది. ఇది దివంగత నేతల విగ్రహాలనూ దగ్ధం చేసేస్తోంది.తిరుపత్తూర్ జిల్లా కందిలి ...
చెన్నై/వేలూరు (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో వేడి రాజుకుంటోంది. ఇది దివంగత నేతల విగ్రహాలనూ దగ్ధం చేసేస్తోంది.తిరుపత్తూర్ జిల్లా కందిలి సమీపం గెజల్నాయకన్ పట్టి మెయిన్ రోడ్డులో ఎంజీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల నిబంధనలు అమలుకు రావడంతో రెవెన్యూ అధికారులు విగ్రహాన్ని గుడ్డలతో మూసివేశారు. ఈ నేపథ్యంలో, సోమవారం ఉదయం 6 గంటల సమయంలో విగ్రహం చుట్టూ ఉన్న దుస్తుల నుంచి మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచా రంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కందిలి పోలీసులు విచారణ చేపట్టారు.