మెట్రో రైల్వే స్టేషన్లలో ఉచిత మధుమేహ పరీక్షలు
ABN , First Publish Date - 2022-03-09T16:04:18+05:30 IST
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం చెన్నైలోని డాక్టర్ మోహన్స్ డయాబెటిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఐదు మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద ఉచిత వైద్య శిబిరాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ శిబిరాల
అడయార్(చెన్నై): మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం చెన్నైలోని డాక్టర్ మోహన్స్ డయాబెటిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఐదు మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద ఉచిత వైద్య శిబిరాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ శిబిరాల ప్రారంభోత్సవంలో ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ వి.మోహన్, ఎండీ డాక్టర్ ఆర్ఎం అంజన, వైద్యులు డాక్టర్ ఎస్.కయల్విళి, డాక్టర్ రాజాలక్ష్మి, డాక్టర్ లవ్లీనా మునవర్ తదితరులు పాల్గొన్నారు. తేనాంపేట, ఆలందూర్, ఎయిర్ పోర్ట్, వడపళని, కోయంబేడు మెట్రో రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాలు ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.