యోగతో మానసిక, శారీరక ఉల్లాసం

ABN , First Publish Date - 2021-06-22T05:40:23+05:30 IST

యోగాతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కురసా ఉమామహేశ్వరరావు అన్నారు.

యోగతో మానసిక, శారీరక ఉల్లాసం
పాడేరు మండలం లగిశపల్లిలో యోగ చేస్తున్న బీజేపీ నేతలు


పాడేరు, జూన్‌ 21: యోగాతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కురసా ఉమామహేశ్వరరావు అన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలో లగిశపల్లిలో బీజేపీ నేతలు యోగా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ యోగా చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. యోగాను జీవనంలో భాగంగా అలవాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఈసందర్భంగా బీజేపీ నేతలు యోగా సనాలు వేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కురసా రాజారావు, సల్లా రామకృష్ణ, పాంగి రవిచంద్ర, కె.అనంతయ్య, ఎల్‌.రమణ, తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-06-22T05:40:23+05:30 IST