మహానాడులోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-05-18T06:19:17+05:30 IST
మహానాడు నిర్వహించేలోగా టీడీపీ సభ్యత్వం నమోదును పూర్తి చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు.
మాజీ మంత్రి ఉమా
గొల్లపూడి, మే 17: మహానాడు నిర్వహించేలోగా టీడీపీ సభ్యత్వం నమోదును పూర్తి చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. గొల్లపూడి ఒన్ సెంటర్లో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ వెనుకడిన కులాల అఽభివృద్ధికి టీడీపీ హయాంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నర్రా వాసు, కొమ్మినేని రామారావు, సాధనాల వెంకటేశ్వరమ్మ, నూతులపాటి వెంకటేశ్వరరావు (నారద), గూడపాటి పద్మశేఖర్, వడ్లమూడి చలపతిరావు, షేక్ కరిముల్లా, మల్లెల శ్యామ్కుమార్, శీలంనేని సాంబశివరావు, ఆలూరి హరికృష్ణ చౌదరి (చిన్న), కోగంటి సూరిబాబు, ధరావతు శ్రీను నాయక్, తదితరుల పాల్గొన్నారు.