కేసీఆర్‌ను కలిసిన బీసీ కమిషన్‌ సభ్యులు

ABN , First Publish Date - 2022-05-26T05:30:00+05:30 IST

కేసీఆర్‌ను కలిసిన బీసీ కమిషన్‌ సభ్యులు

కేసీఆర్‌ను కలిసిన బీసీ కమిషన్‌ సభ్యులు
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న బీసీ కమిషన్‌ సభ్యులు

వికారాబాద్‌, మే  26 : జాతీయ రాజకీయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌ కర్ణాటక రాజధాని బెంగుళూరులో పర్యటిస్తున్నారు. ఈమేరకు తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యులు శుభప్రద్‌పటేల్‌, తదితరులు బెంగుళూరులోని లీలా ప్యాలెస్‌లో సీఎం కేసీఆర్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, ఇప్పటికే కర్ణాటక పర్యటనలో ఉన్న బీసీ కమిషన్‌ సభ్యులు.. తమ స్టడీ టూర్‌ వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఎక్కడికి వెళ్లినా తెలంగాణ పాలన గురించి అద్భుతంగా చర్చ జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యులను సీఎం కేసీఆర్‌ అభినందించినట్లు కమిషన్‌ సభ్యులు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో రాష్ట్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు ఉపేంద్ర, కిషోర్‌ గౌడ్‌లు ఉన్నారు.

Updated Date - 2022-05-26T05:30:00+05:30 IST