కాకినాడలో మేకసూరి చిత్రబృందం సందడి

ABN , First Publish Date - 2020-12-05T06:34:48+05:30 IST

భానుగుడి (కాకినాడ), డిసెంబరు 4: మేకసూరి చిత్రబృందం శుక్రవారం కాకినాడలో సందడి చేసి ంది. ఈ సందర్భంగా హీరో అభినయ్‌ మాట్లాడుతూ నవంబరు 27న ఓటీటీలో విడుదలైన తమ సినిమా ప్రజాదరణ పొందడంతో కాకినాడ వేదికగా చేసుకుని విజయయాత్రను ప్రారంభించామని

కాకినాడలో మేకసూరి చిత్రబృందం సందడి
బృందానికి కాజా అందజేస్తున్న పీఆర్వో వర్మ

భానుగుడి (కాకినాడ), డిసెంబరు 4: మేకసూరి చిత్రబృందం శుక్రవారం కాకినాడలో సందడి చేసి ంది. ఈ సందర్భంగా హీరో అభినయ్‌ మాట్లాడుతూ నవంబరు 27న ఓటీటీలో విడుదలైన తమ సినిమా ప్రజాదరణ పొందడంతో కాకినాడ వేదికగా చేసుకుని విజయయాత్రను ప్రారంభించామని తెలిపారు. రెండు భాగాలుగా విడుదలైన సినిమాను ప్రజలు ఆదరించినందుకు సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు త్రినాధ్‌ మాట్లాడుతూ చిన్న సినిమా అయినా పెద్ద విజయాన్ని అందించినందుకు సంతోషంగా ఉందన్నారు. సినిమాకు ఎక్కడైనా ప్రజదరణ ముఖ్యమని, అందుకే ఓటీటీలో విడుదల చేశామన్నారు. నిర్మాత కార్తీక్‌ కంచెర్ల మాట్లాడుతూ థియేటర్లు తెరుచుకున్న తర్వాత మళ్లీ విడుదల చేస్తామని తెలిపారు. చిత్ర బృందానికి తాపేశ్వరం సురుచి సంస్థ పీఆర్వో వర్మ ప్రత్యేక కాజా అందజేశారు.

Updated Date - 2020-12-05T06:34:48+05:30 IST