వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2022-05-27T04:49:47+05:30 IST
చెన్నూ రు సచివాలయాల పరిధిలో 40 శాతం వైకల్యం, 60 ఏళ్లు పైబడిన వృద్ధు లు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ చీర్ల సురే్షయాదవ్ అన్నారు.
చెన్నూరు, మే 26: చెన్నూ రు సచివాలయాల పరిధిలో 40 శాతం వైకల్యం, 60 ఏళ్లు పైబడిన వృద్ధు లు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ చీర్ల సురే్షయాదవ్ అన్నారు. చెన్నూ రు మూడు సచివాలయా ల్లో గురువారం వికలాంగులకు, వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో వృద్ధులకు సరైన ఆసరా లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి వారి కోసం ఉచితంగా ఆపరేష న్లు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, మోకాళ్ల నొప్పులకు చికిత్స లాంటివి అందిస్తున్నా మన్నారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, శుక్ర,శనివారాల్లో కూడా సేవలుఅందిస్తామన్నారు. వైద్యాధికారులు చెన్నారెడ్డి, బాలకొండరాయుడు, క్రాంతికిరణ్, సువర్ణ పలువురికి పరీక్షలు చేశారు. ద్వామా పీడీ యదుభూషణ్ రెడ్డి, తహసీల్దారు అలీఖాన్, ఎంపీడీఓ మహబూబ్బీ తదితరులు పాల్గొన్నారు.