విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి

ABN , First Publish Date - 2022-01-29T05:49:29+05:30 IST

విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వైద్యాధికారి శ్రీనివాస్‌ సూచించారు.

విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి
అప్పలరాజుగూడెం విద్యార్థులకు వైద్య పరీక్షలు

టి.నరసాపురం, జనవరి 28: విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వైద్యాధికారి శ్రీనివాస్‌ సూచించారు. అప్పలరాజుగూడెం గురుకుల పాఠశాల లో శుక్రవారం 40 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. కరోన వైరస్‌ విజృంభిస్తున్న దృష్ట్యా విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కు లు ధరించాలన్నారు. ప్రిన్సిపాల్‌ నరసింహస్వామి, సీహెచ్‌ వో ప్రసాదరావు, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్లు తాతారావు, మోహనరావు, ఏఎన్‌ఎం షకీల పాల్గొన్నారు.


జీలుగుమిల్లి: పాఠశాల్లో విద్యార్ధులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఏటీడబ్లువో కృష్ణ మోహన్‌ అన్నారు. గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల్లో స్కూల్‌ సేఫ్టీ ప్రోగ్రామ్‌లో భాగంగా విద్యార్థులకు ఆరోగ్యశాఖ, పోలీస్‌ శాఖల అధికారులు పలు సూచనలు ఇచ్చారు. హెచ్‌ఎం యు.వీర్రాజు, పీహెచ్‌ఎన్‌ సంజీవ, ఏఎస్‌వో వెంకటేశ్వరావు, హెచ్‌సీ ఉదయ్‌, కె.ప్రకాష్‌ ఉన్నారు.

Updated Date - 2022-01-29T05:49:29+05:30 IST