Chief Minister Stalin: ఎంసీసీఐకి నూతన కార్యవర్గం
ABN , First Publish Date - 2022-08-18T16:38:07+05:30 IST
‘మద్రాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఎంసీసీఐ)కి కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ఇటీవల జరిగిన వార్షిక సమావేశంలో సభ్యులు కొత్త కార్యవర్గాన్ని
చెన్నై, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ‘మద్రాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఎంసీసీఐ)కి కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ఇటీవల జరిగిన వార్షిక సమావేశంలో సభ్యులు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. టఫే గ్రూపు అధ్యక్షుడు టీఆర్ కేశవన్ అధ్యక్షుడిగా, చెంప్లాస్ట్ సన్మార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాంకుమార్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)ను కలుసుకుని ఆయన అభినందనలు అందుకున్నారు.