అభివృద్ధి పనులకు మేయర్‌ శంకుస్థాపన

ABN , First Publish Date - 2021-10-29T04:26:02+05:30 IST

అందరూ సహకరిస్తేనే కాలనీలు అభివృద్ధి చెందుతాయని మేయర్‌ జి.హరివెంకట కుమారి అన్నారు. నాతయ్యపాలెం శ్మశానవాటిక అభివృద్ధి, షీలానగర్‌ రహదారి నిర్మాణ పనులకు గురువారం ఆమె శంకుస్థాపన చేశారు.

అభివృద్ధి పనులకు మేయర్‌ శంకుస్థాపన
శ్మశానవాటిక అభివృద్ధికి శంకుస్థాపన చేస్తున్న మేయర్‌

అక్కిరెడ్డిపాలెం, అక్టోబరు 28: అందరూ సహకరిస్తేనే కాలనీలు అభివృద్ధి చెందుతాయని మేయర్‌ జి.హరివెంకట కుమారి అన్నారు.  నాతయ్యపాలెం శ్మశానవాటిక అభివృద్ధి, షీలానగర్‌ రహదారి నిర్మాణ పనులకు గురువారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖను సుందరనగరంగా తీర్చి దిద్దడమే లక్ష్యమన్నారు. పనులు సకాలంలో పూర్తిచేయాలని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కోరారు. గాజువాక జోనల్‌ కమిషనర్‌ డి.శ్రీధర్‌, వైసీపీ నేతలు జీవీ కృష్ణారావు, బోగాది సన్యాసిరావు, ఈగలపాటి  యువశ్రీ, గోపిశెట్టి గోపి, జీవన్‌బాబు, అక్కిరెడ్డి శ్రీను, వరదాడ రమణ, బి.జోసఫ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T04:26:02+05:30 IST