బిన్నలలో భారీ చోరీ
ABN , First Publish Date - 2020-10-20T08:25:45+05:30 IST
మందస మండలం బిన్నలలో ఆదివారం రాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. పెట్రోల్ బంక్తో పాటు ఓ ఇంట్లో చొరబడి రూ.13 లక్షల నగదు చోరీకి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన
ఓ ఇంటితో పాటు పెట్రోల్ బంక్లో దొంగతనం
రూ.13.03 లక్షల నగదు మాయం
హరిపురం, అక్టోబరు 19: మందస మండలం బిన్నలలో ఆదివారం రాత్రి దొంగలు హల్చల్ సృష్టించారు. పెట్రోల్ బంక్తో పాటు ఓ ఇంట్లో చొరబడి రూ.13 లక్షల నగదు చోరీకి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత మార్పు నాగయ్య ఇంట్లో దొంగలు ప్రవేశించారు. బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.8.40 లక్షల నగదును దోచుకుపోయారు. అక్కడి నుంచి గ్రామ శివారులో హైవేపై ఉన్న పెట్రోల్ బంకులో చోరీకి పాల్పడ్డారు. సిబ్బంది నిద్రిస్తుండగా ఆఫీసు గదిలో ఉంచిన రూ.4.63 లక్షల నగదును పట్టుకుపోయారు.
వేకువజామున దొంగతనం జరిగినట్టు గుర్తించిన నాగయ్య కుటుంబసభ్యులతో పాటు పెట్రోల్ బంక్ సిబ్బంది మందస పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం డీఎస్పీ డి.శివరామిరెడ్డి, ఇచ్చాపురం సీఐ ఎం.వినోద్బాబు, ఎస్ఐ బి.రామారావు ఘటనా స్థలాలకు చేరుకున్నారు. క్లూస్టీం ఎస్ఐ మురళీమోహన్ ఆధ్వర్యంలో సిబ్బంది పరిశీలించారు. స్థానిక వ్యక్తులే చోరికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ బి.రామారావు తెలిపారు.