ఒరిస్సాకు చెందిన వివాహిత హైదరాబాద్లో మిస్సింగ్
ABN , First Publish Date - 2021-05-11T16:03:38+05:30 IST
ఓ వివాహిత అదృశ్యమైంది.
హైదరాబాద్/బర్కత్పుర : ఓ వివాహిత అదృశ్యమైంది. కాచిగూడ అడ్మిన్ ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సా రాష్ర్టానికి చెందిన లీటుపున్నార్ భార్య ప్రీతిప్రభబేహారా (20)తో కలిసి బర్కత్పురాలో నివాసం ఉంటున్నారు. భర్త ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. భర్త డ్యూటీకి వెళ్లిన తర్వాత ఈనెల 5న ప్రీతిప్రభ బేహారా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చిన లీటుపున్నార్కు భార్య కనిపించలేదు. స్నేహితులు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. సోమవారం కాచిగూడ పీఎస్లో ఫిర్యాదుచేశాడు.