మరికొద్ది గంటల్లో పెళ్లి.. మండపానికి చేరుకుంటున్న బంధువులు.. అప్పుడు తెలిసింది ఒక షాకింగ్ వార్త.. వధువు ముగ్గురు సోదరులు..

ABN , First Publish Date - 2021-11-22T17:30:42+05:30 IST

మరికొద్ది గంటల్లో పెళ్లి.. అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు జరిగాయి.. బంధువులందరూ మండపానికి చేరుకున్నారు..

మరికొద్ది గంటల్లో పెళ్లి.. మండపానికి చేరుకుంటున్న బంధువులు.. అప్పుడు తెలిసింది ఒక షాకింగ్ వార్త.. వధువు ముగ్గురు సోదరులు..

మరికొద్ది గంటల్లో పెళ్లి.. అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు జరిగాయి.. బంధువులందరూ మండపానికి చేరుకున్నారు.. సరదాగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు.. ముహూర్తం దగ్గరపడుతోందనగా వారందరికీ షాకింగ్ వార్త తెలిసింది.. వధువు ముగ్గురు సోదరులు ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని సమాచారం వచ్చింది.. దీంతో అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న అందరి వదనాలు విషాదభరితంగా మారిపోయాయి.. ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. 


ఆగ్రాకు చెందిన రీనా అనే వధువు వివాహానికి గ్వాలియర్‌లో ఓ పెళ్లి మండపాన్ని వేదికగా నిర్ణయించారు. రీనాతో కలిసి ఆమె తల్లి, ఇతర బంధువులు ఆదివారం సాయంత్రం పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు. రీనా తండ్రి, సోదరులు రాత్రికి బయల్దేరాలనుకున్నారు. పెళ్లికి సంబంధించిన వస్తువులు కొనేందుకు రీనా సోదరులు హర్ష, ప్రేమ్, అంకిత్ అగ్రా మార్కెట్‌కు ఒకే బైక్‌పై వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేటపుడు వారి బైక్‌ను ఓ ట్రక్ ఢీకొట్టింది. ప్రేమ్, అంకిత్ అక్కడికక్కడే చనిపోగా.. హర్ష చికిత్స అందుకుంటూ మరణించాడు. దీంతో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది. 

Updated Date - 2021-11-22T17:30:42+05:30 IST