వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-11T06:09:25+05:30 IST

భర్త నిరాధరణతో జీవితంపై విరక్తితో వివాహిత మల్కాపురం వద్ద ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది.

వివాహిత ఆత్మహత్య

జగ్గయ్యపేట రూరల్‌ : భర్త నిరాధరణతో జీవితంపై విరక్తితో వివాహిత మల్కాపురం వద్ద  ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది.  వత్సవాయి మండలం ఇందుగపల్లి గ్రామానికి చెందిన  కర్నాటి దీప్తికి(22), అదే మండలంలోని కన్నెవీడు గ్రామానికి చెందిన కర్నాటి నితిన్‌కుమార్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. నితిన్‌ హైదరాబాద్‌లో అధ్యాపకుడిగా పని చేస్తున్నాడు. కొద్ది నెలలుగా భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో దీప్తి ఆమె తల్లిదండ్రుల వద్ద ఇందుగపల్లిలో ఉంటుంది. బుధవారం ఉదయం మల్కాపురంలోని అమ్మమ్మ వెంకటనర్సమ్మ వద్దకు వచ్చి బ్యాంకు వివరాలు, పాసు పుస్తకాల గురించి అడిగి ఇంటికి వెళ్తూ వ్యవసాయ భూములకు అనుసంధానంగా ఉన్న డొంక రోడ్డులోకి వెళ్లి పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల నివేదికతో ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఎస్సై చిన్నబాబు విచారించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చెప్పులు, అగ్గిపెట్ట్టె, పెట్రోల్‌ బాటిల్‌, పరిసరాలను గమనించి ఆత్మహత్యగా ధ్రువీకరి స్తున్నారు. ఇందుగపల్లిలో విషాద చాయలు అలుము కున్నాయి. గ్రామానికి చెందిన వాసిరెడ్డి కిరణ్‌, ఆదిలక్ష్మిల ఏకైక కుమార్తె దీప్తి ఆత్మహత్య ఘటనతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాదం నెలకొంది.



Updated Date - 2022-08-11T06:09:25+05:30 IST