సొంత కేడర్‌లోని ప్రేమజంటను మట్టుబెట్టిన మావోలు

ABN , First Publish Date - 2022-01-07T21:54:26+05:30 IST

పెళ్లి చేసుకోవాలని క్యాంపు నుంచి వెళ్లిపోయిన సొంత కేడర్‌లోని జంటను మావోయిస్టులు దారుణంగా..

సొంత కేడర్‌లోని ప్రేమజంటను మట్టుబెట్టిన మావోలు

బీజాపూర్: పెళ్లి చేసుకోవాలని క్యాంపు నుంచి వెళ్లిపోయిన సొంత కేడర్‌లోని జంటను మావోయిస్టులు దారుణంగా చంపేశారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిందీ ఘటన. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మిలీషియా ప్లాటూన్ కమాండర్ కమ్లు పునెం, మిలీషియా సభ్యురాలు మంగి కొంతకాలం నుంచి సన్నిహితంగా ఉంటున్నారు.


ఈ క్రమంలో పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే గురువారం క్యాంపు నుంచి పరారయ్యారు. అయితే, వీరు ఎక్కడున్నదీ ఆచూకీ కనిపెట్టిన సహచరులు ప్రజాకోర్టు నిర్వహించిన అనంతరం వారిని దారుణంగా హత్య చేసినట్టు ఐజీపీ (బస్తర్ రేంజ్) సుందర్ రాజ్ తెలిపారు.  

 

11 మావోయిస్టు సంబంధిత ఘటనల్లో పునెం మోస్ట్ వాంటెడ్ కాగా, మూడు ఘటనల్లో మంగి పేరు కూడా పోలీస్ రికార్డులకెక్కింది. కాగా, గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే మరో వ్యక్తి కూడా హత్యకు గురైనప్పటికీ ఆయనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని ఐజీ పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-07T21:54:26+05:30 IST