చెన్నూరు టీడీపీలో పలువురు చేరిక

ABN , First Publish Date - 2022-07-04T04:04:23+05:30 IST

చెన్నూరు పట్టణంలోని 12వ వార్డుకు చెందిన కాంగ్రెస్‌ వార్డు సభ్యురాలు చిలుముల మధునమ్మ, తగరం మోహిని, చంద్రకళ, తగరం సరితల ఆధ్వర్యంలో సుమారు వంద మంది మహిళలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు.

చెన్నూరు టీడీపీలో పలువురు చేరిక
టీడీపీలో చేరిన వారికి కండువా వేస్తున్న సంజయ్‌కుమార్‌

చెన్నూరు, జూలై 3:  చెన్నూరు పట్టణంలోని 12వ వార్డుకు చెందిన కాంగ్రెస్‌ వార్డు సభ్యురాలు చిలుముల మధునమ్మ, తగరం మోహిని, చంద్రకళ, తగరం సరితల ఆధ్వర్యంలో సుమారు వంద మంది మహిళలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  కార్యక్రమంలో నాయకులు ఎండీ షరీఫా, బైరాజు శ్రీనివాస్‌, వాసాల సాగర్‌, బోర్లకుంట శ్రీనివాస్‌, తిరుపతి, రజియా, సమ్మక్క, మనీషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T04:04:23+05:30 IST