స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం

ABN , First Publish Date - 2022-08-14T06:41:34+05:30 IST

స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం చేశారని వారిని స్మరించుకుంటూ ఆజాద్‌కి గౌరవ యాత్ర నిర్వహించి నట్లు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పే ర్కొన్నారు.

స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం
పాద యాత్ర చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

వెల్గటూర్‌, ఆగస్టు 13: స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగం చేశారని వారిని స్మరించుకుంటూ ఆజాద్‌కి గౌరవ యాత్ర నిర్వహించి నట్లు కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పే ర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఆజాద్‌కి గౌరవ యాత్రలో భాగంగా కాంగ్రెస్‌ మండలశాఖ ఆధ్వర్యంలో కిషన్‌ రా వుపేట నుంచివెల్గటూర్‌ వరకు పాద యాత్ర నిర్వహించారు. ఈ సంద ర్భంగా అడ్లూరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వలన తె లంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిందని దుయ్యబట్టారు. తె లంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు కావస్తున్నా ప్రజలు కన్న కలలు కలలు గానే మిగిలాయన్నారు. లిఫ్ట్‌ల పేరుతో ఇతర ప్రాంతాలకు గోదావరి నీటిని తరలిస్తున్నారని, ధర్మపురి నియోజకవర్గంలో గోదావరి వాటా ఎంతో తే ల్చాలని డిమాండ్‌ చేశారు. దళితులకు ఇచ్చిన హామీ మేరకు మూడె క రాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  కాంగ్రెస్‌ మండలశాఖ అధ్య క్షుడు శైలేంధర్‌రెడ్డి, గుండాటి జితేంధర్‌ రెడ్డి, మేరుగు మురళి, ఎంపీటీసీ రంగు తిరుపతి, సందీప్‌రెడ్డి, పూదరి రమేష్‌, గండ్ర శ్రీకాంత్‌రావు, గాజుల విజయ్‌, గెల్లు శ్రీనివాస్‌, ఉదయ్‌, నరేష్‌, వెంకటస్వామి, కుమారస్వామి, పోలోజు శ్రీనివాస్‌, శశి, హరీష్‌, లచ్చిరెడ్డి, తిరుపతి, శ్రావణ్‌రెడ్డి, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-14T06:41:34+05:30 IST