Manipurలో తుది విడత పోలింగ్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-03-05T12:47:23+05:30 IST

మణిపూర్‌లో తుది విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమైంది....

Manipurలో తుది విడత పోలింగ్ ప్రారంభం

మణిపూర్: మణిపూర్‌లో తుది విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. మణిపూర్‌లో 60 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా తుది విడత 22 స్థానాల్లో పోలింగ్ సాగుతోంది. 22 సీట్లలో 92 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 8,38,730 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తౌబాల్, జిరిబం, చండేల్, ఉఖ్రూల్, సేనాపతి, టామెన్ గ్లాంగ్ జిల్లాల్లో పోలింగ్ సాగుతోంది. 1247 పోలింగ్ కేంద్రాల్లో సాయుధ పోలీసుల పహరా మధ్య పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.ఇంఫాల్ ఈస్ట్, చురాచంద్ పూర్ జిల్లాల్లోని 12 పోలింగ్ కేంద్రాల్లోనూ రీ పోలింగ్ సాగుతోంది. మొదటివిడత పోలింగులో 12 కేంద్రాల్లో ఈవీఎంలను దుండగులు పగులగొట్టారు. దీంతో 12 కేంద్రాల్లో రీ పోలింగ్ ప్రారంభించారు. శనివారంనాటితో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం ముగియనుంది.


Updated Date - 2022-03-05T12:47:23+05:30 IST