మొదలైన మామిడి వ్యాపారం
ABN , First Publish Date - 2022-05-18T06:57:29+05:30 IST
బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మంగళవారం నుంచి మామిడి పండ్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి.
బంగారుపాళ్యం, మే 17: బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మంగళవారం నుంచి మామిడి పండ్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు టేబుల్ వెరైటీలైన బేనీషా రకం టన్ను రూ.30 వేల నుంచి రూ.35 వేలు.. సింధూర టన్ను రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు ధర పలికింది. అత్యధికంగా దిగుబడి అవుతున్న తోతాపురి రకం రూ.16 వేల నుంచి రూ.22 వేలు ధర ఉంది. ఇతర టేబుల్ వెరైటీ రకాలు రూ.36 వేలు పలికాయి.