పడమర మంగళిపాలెంలో బాదుడే బాదుడు

ABN , First Publish Date - 2022-08-09T02:58:09+05:30 IST

: పట్టణంలోని పడమర మంగళిపాలెంలో సోమవారం సాయంత్రం టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.

పడమర మంగళిపాలెంలో బాదుడే బాదుడు
బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు


  కందుకూరు, ఆగస్టు 8: పట్టణంలోని పడమర మంగళిపాలెంలో సోమవారం సాయంత్రం  టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంలు స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు, అన్నిరకాల చార్జీలు విపరీతంగా పెరగటంతో ఈ ప్రభుత్వంలో సామాన్యుడి జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దామా మల్లేశ్వరరావు, చిలకపాటి మధు, పాకల మల్లికార్జునరావు, జి. మోషే, యన్‌వి సుబ్బారావు, బెజవాడ ప్రసాద్‌, రెబ్బవరపు మాల్యాద్రి, దార్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-09T02:58:09+05:30 IST