Uttar pradesh: ఛీ..ఛీ.. వీడసలు భర్తేనా.. స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం.. కారణమేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-07-09T21:08:20+05:30 IST

తనను నమ్మి వచ్చిన భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్త పశువు కన్నా హీనంగా ప్రవర్తించాడు.

Uttar pradesh: ఛీ..ఛీ.. వీడసలు భర్తేనా.. స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారం.. కారణమేంటో తెలిస్తే..

తనను నమ్మి వచ్చిన భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్త పశువు కన్నా హీనంగా ప్రవర్తించాడు. మద్యానికి బానిసై భార్యను డబ్బుల కోసం స్నేహితులకు అప్పగించాడు. స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. గోరఖ్‌పూర్‌కు చెందిన ఒక జంటకు 2021లో పెళ్లయింది. కొన్నిరోజుల పాటు కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత బంఢారం బయటపడింది. తనకు ఉద్యోగం ఉందని అబద్ధం చెప్పి ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. భర్తకు సంపాదన లేకపోగా.. తాగుడు అలవాటు కూడా ఉంది.


ఇది కూడా చదవండి..

Crime: భార్యకు AIDS అని తెలిసి దూరం.. మరదలితో అఫైర్.. చివరకు ఎంత పని చేశాడంటే..


ప్రతిరోజు తాగి ఇంటికి వెళ్లేవాడు. కట్నం డబ్బులు తీసుకురావాలని భార్యను వేధిస్తుండేవాడు. మద్యానికి అవసరమైన డబ్బుల కోసం దారుణానికి ఒడిగట్టాడు. భార్యను స్నేహితులకు అప్పగించేవాడు. స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడేవాడు. ఆ ఘటనలను వీడియోలు తీసి ఆమెను బెదిరించేవాడు. ఆరునెలల పాటు మహిళ ఈ టార్చర్ భరించింది. చివరకు ఓపిక నశించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

Updated Date - 2022-07-09T21:08:20+05:30 IST