ఏలేరు కాలువలో వ్యక్తి గల్లంతు
ABN , First Publish Date - 2022-05-24T06:22:21+05:30 IST
గ్రామ శివారు ఏలేరు కాలువలో పడి రౌతులపూడికి చెందిన జిగిరెడ్డి నాగన్నదొర (50) గల్లంతయ్యాడు. సోమవారం ఉదయం తాపీపని నిమిత్తం నాగన్నదొర పిఠాపురం వెళ్లాడు.
రౌతులపూడి, మే 23: గ్రామ శివారు ఏలేరు కాలువలో పడి రౌతులపూడికి చెందిన జిగిరెడ్డి నాగన్నదొర (50) గల్లంతయ్యాడు. సోమవారం ఉదయం తాపీపని నిమిత్తం నాగన్నదొర పిఠాపురం వెళ్లాడు. తిరిగి రౌతులపూడి వస్తుండగా కాలువలో స్నానం చేయడానికి దిగి జారి గల్లంతయ్యాడు. యువకులు గాలిస్తున్నారు.