రైలు ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-06-26T04:45:04+05:30 IST
రైల్వే ట్రాక్ దాటుతున్న ఓవ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన లంకెలపాలెం సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది.
లంకెలపాలెం, జూన్ 25: రైల్వే ట్రాక్ దాటుతున్న ఓవ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన లంకెలపాలెం సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. దువ్వాడ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాకు చెందిన రాజేంద్ర భగతి (30) లంకెలపాలెం క్యాటరింగ్ బాయ్గా పనిచేస్తున్నాడు. జాతీయ రహదారి కూడలి నుంచి తన నివాసానికి నడుచుకుంటూ వెళ్తూ రైల్వే ట్రాక్ దాటే క్రమంలో విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైలు ఢీకొంది. ఈప్రమాదంలో రాజేంద్ర భగతి సుమారు పది మీటర్లు ఎగిరి పడి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇతడు నెల రోజుల కిందటే ఉపాధి నిమిత్తం ఇక్కడకు వలస వచ్చాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జీఆర్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్మార్ట్ం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.