రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-05-13T04:55:35+05:30 IST

మండలంలోని చౌటిపల్లె ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యేసోబు (65) అనే వ్యక్తి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొండాపురం, మే 12: మండలంలోని చౌటిపల్లె ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యేసోబు (65) అనే వ్యక్తి మృతి చెందాడు. గండ్లూరు గ్రామానికి చెందిన యేసోబు తన బైకులో పెట్రోల్‌ బంకులో పెట్రోల్‌ నింపుకొని వస్తుండగా తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న టయోట వాహనం ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడ మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొండాపురం ఎస్‌ఐ మంజునాథ  తెలిపారు.

Updated Date - 2021-05-13T04:55:35+05:30 IST