లిఫ్ట్ నుంచి పడి వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-02-20T09:15:24+05:30 IST
అపార్టుమెంటులో అమర్చిన లిఫ్ట్ నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం..
రావులపాలెం రూరల్, ఫిబ్రవరి 19: అపార్టుమెంటులో అమర్చిన లిఫ్ట్ నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రావులపాలేనికి చెందిన కర్రి వెంకటప్రతాపరెడ్డి(46) స్థానికంగా ఓ అపార్టు మెంట్లోకి పని నిమిత్తం వెళ్లాడు. లిఫ్ట్ ఎక్కగా, రెండో ఫ్లోర్ వద్ద నుంచి ప్రమాదవశాత్తూ కిందకు జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పి.బుజ్జిబాబు తెలిపారు.
‘ఫార్మశీ’ హాస్టల్ పరిశీలన
తాళ్లరేవు: కోరింగ ఫార్మశీ కళాశాలలో నిర్వహణ, మౌళిక వసతులను జిల్లా అధికారులు బృందం బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూకే డైరెక్టర్ వి.రవీంద్ర, మెకానికల్ గ్రీవెన్స్ డైరెక్టర్ ఎ.స్వర్ణకుమారి, ప్రొఫెసర్ ఇన్చార్జి ఫార్మశీ పద్మ కళాశాలోని హాస్టల్ పరిస్థితులను పరిశీలించారు. హాస్టల్ యూనివర్సిటీ అనుమతులు లేవని, అది ప్రైవేటు హాస్టలని తెలిపారు. నివేదికను జిల్లా కలెక్టరుకు నివేదిస్తామన్నారు.
పోలీసుల విచారణ
కళాశాల డైరెక్టర్ జి.శ్రీనివాసరావుపై ఫార్మశీ విద్యార్థిని చేసిన ఫిర్యాదు నేపథ్యంలో కాకినాడ రూరల్ సీఐ ఎ.మురళీకృష్ణ, ఎస్ఐ వై.సతీష్ విచారణ చేపట్టారు. బాధితురాలితోపాటు ఆమె తండ్రి, కళాశాల యాజమాన్యాన్ని పోలీసులు విచారించారు