దుబాయ్‌లో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-03-04T05:22:15+05:30 IST

పెనగలూరు మండలం కొండూరు పంచాయతీలోని సిరివరం హరిజనవాడకు చెందిన కొప్పల పెంచలయ్య (28) దుబాయ్‌లో 15ర ోజుల కిందట అనుమానాస్పదంగా మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

దుబాయ్‌లో యువకుడి మృతి
కొప్పల పెంచలయ్య(ఫైల్‌)

15 రోజులకు స్వగ్రామానికి మృతదేహం


పెనగలూరు, మార్చి 3 : పెనగలూరు మండలం కొండూరు పంచాయతీలోని సిరివరం హరిజనవాడకు చెందిన కొప్పల పెంచలయ్య (28) దుబాయ్‌లో 15ర ోజుల కిందట అనుమానాస్పదంగా మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కన్న బిడ్డపై మమకారంతో తల్లిదండ్రులు నిరుపేదలైనప్పటికీ గ్రామంలో అప్పు చేసి 30 వేల రూపాయలు దుబాయ్‌లో తెలిసిన వారికి పంపగా అక్కడి నుంచి 15 రోజుల తరువాత మంగళవారం సిరివరం గ్రామానికి మృతదేహం చేరింది. కటిక పేదరికం అనుభవించే దళిత నిరుపేద తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు తల్లడిల్లిపోయారు. కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుందామని నాలుగేళ్ల కిందట దుబాయ్‌ వెళ్లిన పెంచలయ్య అక్కడికెళ్లినప్పటి నుంచి కష్టాలు, కన్నీళ్లతోనే గడిపాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్‌ వెళ్లడానికి చేసిన  రెండు లక్షల రూపాయల అప్పులు కూడా తీరకముందే కన్ను మూశాడని కన్నీటిపర్యంతమయ్యారు. తన అన్నలు ముగ్గురు పెళ్లిళ్లు చేసుకొని ఎవరిదారి వారు చూసుకోగా వృద్ధుడైన తండ్రి, మతిస్థిమితం లేని తల్లిని బాగా చూసుకోవాలని, తమ్ముడిని మంచి చదువులు చదివించుకోవాలన్న పెంచలయ్య కోరకలు పరాయి దేశంలో ఆవిరైపోయాయని విలపించారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-03-04T05:22:15+05:30 IST