సెల్లార్‌ గుంతలోపడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-04-12T06:51:47+05:30 IST

నీటితో నిండిన సెల్లార్‌ గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

సెల్లార్‌ గుంతలోపడి వ్యక్తి మృతి

పంజాగుట్ట, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): నీటితో నిండిన సెల్లార్‌ గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. తమిళనాడు రాష్ట్రం, తిరువల్లూరుకు చెందిన పి. కుమారస్వామి(32) ఉపాధి నిమిత్తం పదేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. అమీర్‌పేట బాయిస్‌ హాస్టల్‌లో ఉంటూ స్థానికంగాగల చందన బ్రదర్స్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి అప్పుడప్పుడు ఫిట్స్‌ వచ్చేవి. ఆదివారం విధులకు వెళ్లాడు. అమీర్‌పేట ప్రధాన రహదారిలోగల సితార హోటల్‌ పక్కన నీటితో నిండిన సెల్లార్‌ గుంతలోపడి మృతి చెందాడు. షోరూమ్‌ బిల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ మృతుడి సోదరుడు మోహన్‌కుమార్‌, పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మోహన్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  


Updated Date - 2021-04-12T06:51:47+05:30 IST