చంద్రబాబు పర్యటనను జయప్రదం చేయండి
ABN , First Publish Date - 2022-05-17T06:37:21+05:30 IST
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. తపోవనం సమీపంలోని వీవీఆర్ ఫంక్షన హాల్లో చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన
టీడీపీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు
వీవీఆర్ ఫంక్షన హాల్లో ఏర్పాట్ల పరిశీలన
అనంతపురం అర్బన, మే 16: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. తపోవనం సమీపంలోని వీవీఆర్ ఫంక్షన హాల్లో చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ నాయకులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈనెల 20న టీడీపీ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తల ప్రత్యేక సమావేశానికి చంద్రబాబు నాయుడు హాజరవుతారని తెలిపారు. ఆ కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి, టీడీపీ నాయకులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి, గంపన్న, తలారి ఆదినారాయణ, డిష్ నాగరాజు, సరిపూటి రమణ, మారుతీకుమార్గౌడ్, కూచి హరి, విజయశ్రీరెడ్డి, బల్లా పల్లవి తదితరులు పాల్గొన్నారు.