మహానాడు విజయవంతం చేయండి : బచ్చుల
ABN , First Publish Date - 2020-05-26T08:44:34+05:30 IST
ఈనెల 27, 28 తేదీల్లో జూమ్ యాప్ ద్వారా నిర్వహించే మహానాడును విజయ వంతం చేయాలని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల ..
మచిలీపట్నం టౌన్ : ఈనెల 27, 28 తేదీల్లో జూమ్ యాప్ ద్వారా నిర్వహించే మహానాడును విజయ వంతం చేయాలని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు. బందరులో సోమ వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది కరోనా వల్ల జూమ్ యాప్ ద్వారా ఎవరింట్లో వారు ఉంటూ రెండు రోజుల పాటు నిర్వహించే మహానాడులో భాగస్వామ్యం కావాలన్నారు. వైసీపీ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మునిసిపల్ మాజీ చైర్మన్ బాబాప్రసాద్, పి.వి.ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.