మహానాడు విజయవంతం చేయండి : బచ్చుల

ABN , First Publish Date - 2020-05-26T08:44:34+05:30 IST

ఈనెల 27, 28 తేదీల్లో జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహించే మహానాడును విజయ వంతం చేయాలని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల ..

మహానాడు విజయవంతం చేయండి : బచ్చుల

మచిలీపట్నం టౌన్‌ : ఈనెల 27, 28 తేదీల్లో జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహించే మహానాడును విజయ వంతం చేయాలని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు.  బందరులో సోమ వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది కరోనా వల్ల జూమ్‌ యాప్‌ ద్వారా ఎవరింట్లో వారు ఉంటూ రెండు రోజుల పాటు నిర్వహించే మహానాడులో భాగస్వామ్యం కావాలన్నారు.  వైసీపీ ఏడాది పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ బాబాప్రసాద్‌, పి.వి.ఫణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-26T08:44:34+05:30 IST