మేజర్ సుమన్ గవానీకి అత్యున్నత పురస్కారం
ABN , First Publish Date - 2020-05-29T23:40:18+05:30 IST
ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారం ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్-2019’కి భారత సైన్యాధికారిణి మేజర్ సుమన్ గవానీ ఎంపికయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారం ‘మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డ్-2019’కి భారత సైన్యాధికారిణి మేజర్ సుమన్ గవానీ ఎంపికయ్యారు. దక్షిణ సుడాన్లో శాంతి పరిరక్షణలో ఉత్తమ సేవలందించినందుకుగాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా ఘనత సొంతం చేసుకున్నారు. మే 29న అంతర్జాతీయ యూఎన్ పీస్ కీపర్స్ డే సందర్భంగా అవార్డులను ప్రకటించారు. సుమన్ గవానీతో పాటు బ్రెజిల్కు చెందిన నేవీ ఆఫీసర్ కార్లా మాంటెరియో డి కాస్ట్రో అరుజోవా ఈ అవార్డు దక్కించుకున్నారు.