వారంలో 50 వేల మంది కడుపు నింపిన మహింద్ర అండ్ మహింద్ర

ABN , First Publish Date - 2020-04-06T02:08:28+05:30 IST

ఆపన్నులకు ఆహారం, రేషన్ సరుకులు అందించేందుకు దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో కిచెన్లను

వారంలో 50 వేల మంది కడుపు నింపిన మహింద్ర అండ్ మహింద్ర

న్యూఢిల్లీ: ఆపన్నులకు ఆహారం, రేషన్ సరుకులు అందించేందుకు దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో కిచెన్లను ప్రారంభించినట్టు ప్రముఖ వాహన తయారీ సంస్థ మహింద్ర అండ్ మహింద్ర తెలిపింది. గత వారం రోజుల్లో 50 వేల మంది దినసరి కూలీలు, వలస కార్మికులకు ఆహారం అందజేశామని, 10 వేల రేషన్ ప్యాకెట్లు పంపిణీ చేశామని ఆ సంస్థ సీఈవో, ఎండీ పవన్ గోయెంకా ట్విట్టర్ ద్వారా తెలిపారు. అవసరమైన వారికి ఆహారం పంపిణీ చేయాలనుకునే వారు అవసరమైతే తమ కిచెన్లను వాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. మహింద్ర కిచెన్ల ద్వారా రోజుకు 10 వేల మందికి ఆహారం సిద్ధం చేయొచ్చని ఆయన వివరించారు. మరోవైపు, కరోనా రోగుల కోసం వెంటిలేటర్లు ఉత్పత్తి చేస్తోంది. మెడికల్ సిబ్బంది కోసం ఫేస్ షీల్డ్‌‌లు, శ్వాసకోశ పరికరాలను తయారు చేస్తోంది. 50 వేల ఫేస్ షీల్డ్‌లను ఉచితంగా ఇవ్వనున్నట్టు గోయెంకా ఇటీవల ప్రకటించారు.   

Updated Date - 2020-04-06T02:08:28+05:30 IST