మంచికల్లులో వివాహిత ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-21T05:38:01+05:30 IST
మండలంలోని మంచికల్లు గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ పురుగు మందు తాగి ఆత్మ హత్య చేసుకోగా మరో యువకుడు చావుబతుకుల మధ్య నరసరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మంచికల్లు(రెంటచింతల), జనవరి 20: మండలంలోని మంచికల్లు గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళ పురుగు మందు తాగి ఆత్మ హత్య చేసుకోగా మరో యువకుడు చావుబతుకుల మధ్య నరసరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్ఐ చల్లా సురేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వీర్ల మహేశ్వరీ, రమేష్ భార్యాభర్తలు. వీరికి 11 నెలల బాబు కూడా ఉన్నాడు. కొంతకాలం నుంచి వీర్ల దుర్గారావుతో సన్నిహి తంగా ఉంటున్న సంగతి బయటకు పొక్కడంతో ఇద్దరు కలిసి బుధవారం పురుగుమందు తాగారు. మాచర్ల ఆసుపత్రికి తరలిస్తుండగా మహేశ్వరీ ప్రాణాలిడిచింది. దుర్గారావును మెరుగైన చికిత్స కోసం నరసరావుపేటకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. భర్త రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.