మహేశ్వరం రైతు వేదిక భవనం రెడీ

ABN , First Publish Date - 2020-08-05T09:22:22+05:30 IST

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహశ్వరంలో చేపట్టిన రైతువేదిక మోడల్‌ ప్రాజెక్టు భవనం ప్రారంభానికి సిద్ధమైంది

మహేశ్వరం రైతు వేదిక భవనం రెడీ

రాష్ట్రంలోనే మోడల్‌ భవనంగా ఎంపిక

త్వరలో సీఎం కేసీఆర్‌ లేదా మంత్రి కేటీఆర్‌

ప్రారంభించే అవకాశం

ప్రత్యేక శ్రద్ధతో పనులు పూర్తిచేయించిన కలెక్టర్‌

ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు


మహేశ్వరం : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మహశ్వరంలో చేపట్టిన రైతువేదిక మోడల్‌ ప్రాజెక్టు భవనం ప్రారంభానికి సిద్ధమైంది. నియోజకవర్గం పరిధిలోని సిరిగిరిపురం గ్రామ రెవెన్యూ పరిధిలో చేపట్టిన ఈ భవన నిర్మాణాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిర్మాణపనులను శరవేగంగా పూర్తి చేయించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. రాష్ట్రంలో మోడల్‌ రైతు వేదికగా నిర్మించిన మహేశ్వరం రైతువేదికను రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారని సంబంధిత అధికారులు తెలిపారు. లేదా రాష్ట్రంలో మోడల్‌ రైతు వేదికగా చేపట్టిన ఈ భవనాన్ని బుధవారం, లేదా గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆన్‌లైన్‌లో ప్రారంభిస్తారన్న సమాచారం కూడా ఉంది.


ఈ రైతు వేదిక నిర్మాణంలో భాగమైన రోడ్డు, తదితర పనులను మంగళవారం జిల్లా, మండల స్థాయి అధికారులు పరిశీలించారు. ఏక్షణం ప్రారంభ తేదీ ప్రకటిస్తారోనని, ఈలోగా పనులు పూర్తి చేసేందుకు వారంతా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. మిగి లి ఉన్న పనులను చకచకా చేయిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌తో పాటు సంబంధిత అన్నిశాఖల డివిజన్‌, మం డల స్థాయి అధికారులు దీని నిర్మాణపనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు వేదిక వద్ద ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన పనులన్నింటినీ పూర్తి చేయడంలో వారంతా నిమగ్నమయ్యారు. 

Updated Date - 2020-08-05T09:22:22+05:30 IST