నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఉద్ధవ్!
ABN , First Publish Date - 2020-04-10T07:19:09+05:30 IST
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఓ అనూహ్య రీతిలో చట్టసభ సభ్యుడు కాబోతున్నారు. గవర్నర్ కోటాలో నామినేటెడ్ సభ్యుడిగా ..
ముంబై, ఏప్రిల్ 9: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఓ అనూహ్య రీతిలో చట్టసభ సభ్యుడు కాబోతున్నారు. గవర్నర్ కోటాలో నామినేటెడ్ సభ్యుడిగా ఎమ్మెల్సీగా ఆయనను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. శాసనసభ ఎన్నికల్లో పోటీచేయకపోయినా ఆయన సీఎం పదవి చేపట్టారు. రాజ్యాంగ నిబంధన ప్రకారం.. ఆయన 6 నెలల వ్యవధిలో చట్టసభల్లోని ఏదో ఒక దానిలో సభ్యుడు కావాలి. ఎవరైనా శివసేన ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి అసెంబ్లీకి అడుగిడదామనుకున్నా.. 2 నెలల దాకా ఎన్నికలు జరిగే అవకాశాల్లేవు. కరోనా కారణంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగలేదు. దీంతో రాజ్యాంగ సంక్షోభ నివారణకు, సీఎం రాజీనామా చేయకుండా ఉండేందుకు ఆయనను నామినేటెడ్ కోటాలో కౌన్సిల్ మెంబర్గా చేయాలని నిశ్చయించారు.