బిడ్డకు జన్మనిచ్చిన వారంరోజులకు కరోనాతో మహిళ మృతి
ABN , First Publish Date - 2020-06-06T15:38:04+05:30 IST
కరోనా వైరస్ సోకిన 30 ఏళ్ల గర్భవతి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వారం రోజుల తర్వాత మరణించిన విషాద ఘటన ....
ఔరంగాబాద్ (మహారాష్ట్ర): కరోనా వైరస్ సోకిన 30 ఏళ్ల గర్భవతి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వారం రోజుల తర్వాత మరణించిన విషాద ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో వెలుగుచూసింది. ఔరంగాబాద్ నగరానికి చెందిన 30 ఏళ్ల వయసు గల గర్భవతికి కరోనా సోకడంతో ఆమెను ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రికి తీసుకువచ్చారు. గతనెల 28వతేదీన గర్బిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మహిళకు డయాలసిస్ చేస్తుండగా పరిస్థితి వికటించి మరణించింది. పండంటి బిడ్డకు మొదటిసారి పరీక్షించగా కరోనా లేదరి తేలింది. దీంతో పాపకు రెండోసారి కరోనా పరీక్ష చేశారు. ఔరంగాబాద్ నగరంలో శుక్రవారం ఒక్కరోజే 65 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఔరంగాబాద్ లో కరోనా కేసుల సంఖ్య 1834కు పెరిగింది.