మహారాష్ట్రలో కొత్తగా 47 కరోనా కేసులు..

ABN , First Publish Date - 2020-04-04T20:02:04+05:30 IST

కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న మహారాష్ట్రలో కొత్తగా 47 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ..

మహారాష్ట్రలో కొత్తగా 47 కరోనా కేసులు..

ముంబై: కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న మహారాష్ట్రలో కొత్తగా 47 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య శనివారంనాటికి 537కు చేరినట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా నమోదైన 47 కేసుల్లో 28 కేసులు ముంబై నుంచి, థానే జిల్లా నుంచి 15, పుణె, అమ్రావతి, పింప్రి చించ్వాడ్ నుంచి ఒక్కో కేసు ఉంది.


కోవిడ్-19 ప్రభావం మహారాష్ట్రపై ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా గత 12 గంటల్లో కొత్తగా 355 కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,902కు చేరుకుందని పేర్కొంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,650 కాగా, 184 మందికి వ్యాధి నయం కాడం లేదా వారిని డిశ్చార్చ్ చేయడం జరిగింది. కాగా, తాజా లెక్కల ప్రకారం కరోనా మృతుల సంఖ్య 68కి చేరింది.

Updated Date - 2020-04-04T20:02:04+05:30 IST