మహానాడును విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-05-23T03:23:48+05:30 IST
ఒంగోలులో ఈ నెల 28న జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి
వలేటివారిపాలెం, మే 22 : ఒంగోలులో ఈ నెల 28న జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. టీడీపీ కార్యాలయం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం కార్యకర్తలు, నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. మండల టీడీపీ అద్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ మూడేళ్లలో దుర్మార్గపు పాలనలో అన్ని వర్గాలు ప్రజల తీవ్రంగా నష్టపోయా రన్నారు. కందుకూరు నియెజకవర్గం నుంచి 10 వేల మంది కార్యకర్తలను మహానాడుకు తరలిస్తామని శివరాం, తాను చంద్రబాబునాయుడుకు హమీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రగడ శ్రీనివాస్, గురిజాల బెంజిమెన్, వలేటి నరసింహం, కాకుమాను ఆంజనేయులు, బద్దిపూడి శిఖామణి, లింగాబత్తిన మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.